నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర్య వేడుకలలో ముఖ్య అతిధిగా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
RDO కార్యాలయంలో, ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో,గ్రంధాలయంలో, సహకారం సంఘం వద్ద ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో RDO గోపిరామ్, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్ పాల్గొన్నారు.
ఇంకా, జడ్పీటీసీ మరుపాకుల అరుణసురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, ఎంపీడీఓ పాండు, తహశీల్దార్ కీరణ్మయి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, TRS పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.