74 వ స్వాతంత్ర అ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో, ఆర్ముడ్ రిజర్వ్ కార్యాలయంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం సాయుధ బలాగలచే గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి 74 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే స్వాతంత్ర భారత దేశం అని వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం బాగా పని చేసి దేశ పురోగ్రాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, AO వెంకట శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ సిఐ జాన్ దివాకర్, ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు వెంకటి, కృష్ణఆంజనేయులు, ఐటి ఇన్స్పెక్టర్ రవీందర్, హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, Dpo కార్యాలయం, ఎస్బీ సిబ్బంది పాల్గొన్నారు.