సీఎం జగన్… ఏ ఒక్కరికీ… వాళ్ళ కులం ఏంటి ,గోత్రం ఏంటి.. మతం ఏంటి అనే బేధ భావం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేనిదే చూడటమే లక్ష్యంగా పెట్టుకుని గడచిన మూడున్నరేళ్లుగ పాలన సాగిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ జగనన్న ఇండ్ల పంపిణీ లో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో రెండో విడతగా సారికలో మూడువేల అయిదువందల మందికి ఇండ్ల పట్టాల కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు.
అర్హతే ప్రామాణికంగా… అర్హుడే ఇతి బద్ధంగా ప్లతీ ఒక్కరికీ జగనన్న ఇండ్లను పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పెట్టుకుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. ఈ ఇండ్ల పట్టాల పంపిణీ లో…మరోసారి కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పై వాక్భాణాలు సంధించారు… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. లంచాలకు తావులేకుండా….. భజనలు దరి చేరకుండా… పలుకుబడి ప్రామాణికంగా కాకుండా….
అవసరమే హక్కు గా నేను ఎన్నికైన దగ్గర నుంచీ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నందుకే…నేను ఈ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల చెప్పుకొచ్చారు. అంతకుముందు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ….
సీఎం జగనన్న… మహిళ ల పేరు మీదనే ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో…మగవాళ్లను కించపరచడం కాదని… విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ విజయలక్ష్మి అన్నారు. విజయనగరం సారికలో నవ రత్నాలలో భాగంగా జగనన్న ఇండ్ల పట్టాల పంపిణీ లో విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పాల్గొని మాట్లాడారు.
ప్రతీ ఒక్కరికీ ఇండ్ల పంపిణీ లక్ష్యంగా మన జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మన డిప్యూటీ స్పీకర్ స్వామన్న… అండతో నగరంలో ఇండ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని మేయర్ చెప్పారు. జగనన్న హయాంలో ప్రతి ఒక్కరికీ పట్టాల పంపిణీ జరుగుతోందని మన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో కేవలం మహిళల పేరుతోనే పట్టాల పంపిణీ జరుగుతోందని మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. అంత మాత్రాన భర్తలను… మగవాళ్లను కించపరచడం… తక్కువ చేయడం కాదని మరోసారి మేయర్ స్పష్టం చేశారు.