గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో శుక్రవారం ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆసుపత్రిలోని సెంట్రల్ ఏసి గ్యాస్ ప్లాంట్ మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. పనులు చేస్తున్న నలుగురు టెక్నిషియన్స్ లో మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖ టైలర్ తమ్ముడు అలీ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పేలుడు దాటికి సెంట్రల్ హాల్ లో మంటలు వ్యాపించి ఫర్నిచర్ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, ఎస్ ఐ శ్రీనివాసరెడ్డి లు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకుని పేలుడు సంభవించటాకి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఇదే ఆస్పత్రిలో కోవిడ్ భాధితులకూ చికిత్స అందిస్తున్న విషయం విదితమే.