నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి రాఖీ కట్టారు.
మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పనా జిల్లా కలెక్టర్ మను చౌదరికి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలకు రాఖీ పండగ సందర్భంగా రాఖీలు కట్టారు.
రాఖీ పండుగ సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ జెడ్పి చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారిత సాధించేందుకు ప్రతి సోదరుడు, మహిళా సోదరీమణులకు చేయూతనందించేందుకు ప్రతి సోదరుడు కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.