27.2 C
Hyderabad
May 18, 2024 21: 43 PM
Slider నల్గొండ

మహా సంగ్రామ యాత్రకు సంఘీభావంగా పోస్టర్ విడుదల

#mahasangramam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహా సంగ్రామ యాత్ర పోస్టర్ ను శనివారం స్థానిక బిజెపి పార్టీ నాయకులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 24న, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ప్రారంభమైయ్యే మహాసంగ్రామ యాత్రకు హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి గుర్రంపోడు తండా గిరిజన బాధిత రైతుల పక్షాన సంఘీభావం తెలిపేందుకు యాత్రలో పాల్గోనున్నట్లు బాలాజీ నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు,అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి,కన్వినర్ బాల వేంకటేశ్వర్లు,కోటిరెడ్డి,తిరుమలరావు, రమేష్ నాయుడు,యాదగిరి,మురళి, స్వామి,సైదా,శంకర్,శివాజీ,జగన్ తదితరులు పాల్గొన్నారు.

బి.చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వనపర్తిలో మెడికల్ షాపులో మంటలు

Satyam NEWS

లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ త్రిల్లర్స్ మెచ్చేవారికి ‘నేనెవరు’

Satyam NEWS

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యత స్వీకరించిన కేఆర్ మూర్తి

Satyam NEWS

Leave a Comment