ఆడ్డబిడ్డలకు వరాలు ఇచ్చే దేవుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శనివారం హిమాయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
లబ్ధిదారులకు కార్పొరేటర్ లతో కలిసి చెక్కులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పనులన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడని ఆయన అన్నారు. ఆడ్డబిడ్డలకు షీటింలతో అండంగా ఉండి కాపాడుతున్నారని కూడా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ అమృత, అధికారులు పాల్గొన్నారు.