మధ్యలో ఆగిపోయిన పురపాలక సంఘాల ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
గతంలో పురపాలక సంఘాల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం వరకూ వచ్చి ఆగిపోయింది.
స్క్రూటినీ, పోలింగ్, కౌంటింగ్ కు మాత్రమే ఎన్నికల కమిషన్ తేదీలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది.
ఏపిలో మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అనుకోని అవాంతరాలు వస్తే 17న మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తారు.