కడప జిల్లా నందలూరు మండలం మూత పడిన ఆల్విన్ కాలనీ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం పక్కన 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,5 మందిని ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం నందలూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వారిని హాజరు పరిచారు.
ఈ సమావేశంలో డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, సి.ఐ.హనుమంతు నాయక్,ఎస్సై లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తదితరులు వివరాలు వెల్లడించారు.