13వ జాతీయ వోటర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని పోలింగ్ బూత్ నంబర్ 41 భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో జిహెచ్ఎంసి అధికారి ప్రదున్మ షిండే నేతృత్వంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీనియర్ సిటిజన్స్ నూతల కంటి శ్రీహరిని, ఏడెల్లి శ్యాం రావుని జీహెచ్ఎంసి అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా & బిజెపి వెంగళరావు నగర్ డివిజన్ ఇంచార్జ్, బిజెపి అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్ కుమార్, ఏడెల్లి భాస్కర్, ఆంజనేయులు, చంద్రశేఖర్, అనేకమంది ఓటర్లు హాజరయ్యారు.
సత్యం న్యూస్, అంబర్పేట