24.7 C
Hyderabad
May 16, 2024 23: 38 PM
Slider విజయనగరం

నారా లోకేష్ పాదయాత్ర కు అనుమతి కుదింపు పై టీడీపీ ఫైర్…!

#Nara Lokesh Padayatra

తెలుగు దేశం పార్టీ యువ నేత భవిష్యత్ రాజకీయ దురంధరుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కు అనుమతి ఇవ్వడంపై…విజయనగరం టీడీపీ నేతలు… జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. షరతులతో పాదయాత్ర కు అనుమతి ఇవ్వడమేంటని… భవిష్యత్ రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్ ..

రాష్ట్ర భవితకు మార్గదర్శకుడిగా…రాష్ట్ర సమస్యలను తెలుసుకునేందుకు… పాదయాత్ర తలపెట్టిన తరుణంలో… ఆంక్షలు విధించడం ఏంటని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, విజ్జపు ప్రసాద్, కంది మురళీ నాయుడు లు ప్రశ్నించారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్సార్, అనంతరం జగన్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు.. తాజాగా లోకేష్.. రాష్ట్ర భవిత కోసం పాదయాత్ర తలపెట్టడం తప్పా అంటూ “దేశం”

నేతలు ప్రశ్నించారు. ఈ నెల 27 నుంచీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోతున్న పాదయాత్ర… సమస్యలు తెలుసుకునేందుకేనని….కక్ష కోసం కాదని ఐవీపీ రాజు అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ళ నుంచీ విజయనగరం రోడ్ల మరమ్మతులపై…టీడీపీ స్పందిస్తునే ఉందని…ప్రతీ సారి గ్రీవిన్స్ లో వినతిపత్రం ఇస్తున్న… తాజాగా ఆర్.అండ్ బీ నుంచీ పార్టీ ఆఫీస్ కు వచ్చిన లెటర్..

అందుకు ఉదాహరణ అని ఐవీపీ రాజుతో పాటు, లక్ష్మి వర ప్రసాద్ లు అన్నారు. ఇలాంటి సమస్యలతో పాటు ప్రతీ వ్యక్తి పడుతున్న సమస్య ను తెలుసుకునేందుకు లోకేష్ చేపడుతున్న పాదయాత్ర… జగన్ ప్రభుత్వం కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. పైగా జిల్లా స్థాయిలో డీఎస్పీ స్థాయి ర్యాంక్ అధికారి చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంలో పోలీసు శాఖను తన గుప్పెట్లో పెట్టు కున్నట్లు అనిపిస్తోంది… టీడీపీ ఆరోపించింది. ఆరు నూరైనా…నూరు ఆరైనా…రాష్ట్రంలో నారా లోకేష్ చేపట్టబోతున్న పాదయాత్ర ను విజయవంతం చేసేందుకు పార్టీ పరంగా మేమందరం ముందుంటామన్నారు.

Related posts

ఏపి గవర్నర్ గా కర్నాటక సిఎం యడ్యూరప్ప?

Satyam NEWS

కాగజ్ నగర్ లో ఘనంగా నందమూరి జయంతి

Satyam NEWS

వెంకన్న స్వామి పై ప్రమాణం చేయించి….ఇండ్ల పట్టాల పంపిణీ…!

Bhavani

Leave a Comment