31.2 C
Hyderabad
May 18, 2024 16: 17 PM
Slider ముఖ్యంశాలు

దారుణం

#tirupathi

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో మృతిచెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజుగా గుర్తించారు. మృతుడు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారును దుండగులు ఆపి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. సజీవ దహనం చేయడానికి గల కారణాలేంటనే దానిపై విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

నిరుపేదల ఆకలి విలువను తెలిపేవి రంజాన్ ఉపవాసాలు

Satyam NEWS

ఇన్ ఫ్లూయన్షియల్: అత్యాచారం చేసి ఆసుపత్రిలో రెస్టు

Satyam NEWS

చొచ్చుకువచ్చిన చైనా ఇప్పుడు గగ్గోలు పెడుతోంది

Satyam NEWS

Leave a Comment