రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలో అభం-శుభం తెలియని చిన్నారి పై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యమంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని గోరింట్యాల గ్రామంలో ఆదివారం రాత్రి కోటగిరి శ్రీనివాస్ గౌడ్ అనే కామాంధుడు ఇంట్లో ఎవరు లేని సమయములో, అదే గ్రామానికి చెందిన ఏడు సంవత్సరాల పాపను ఇంట్లోకి పిలిచి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీనితో భయపడి పోయిన ఆ చిన్నారి కేకలు వేయడంతో, చుట్టూ ప్రక్కల వారితో పాటుగా, ఆ పాప కుటుంబ సభ్యులు ఆ ఇంట్లోకి వెళ్ళి చూడగా, అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తూ వారి కంట పడ్డాడు. దాంతో అతనికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కాగా, చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఆ కామాంధుడు ఎల్లారెడ్డిపేట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి దర్జాగా ఉన్నాడు.
previous post