29.7 C
Hyderabad
May 14, 2024 02: 04 AM
Slider మెదక్

నారాయణరావుపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

#Narayana Raopet

సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలం బంజరుపల్లి బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మండల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మండు వేసవి ఏప్రిల్ నెలలో చెరువులు మత్తడి దూకడం అనేది కల. ఆరోజుల్లో బతుకమ్మ వేయడానికి గుంతలు తీసి నీళ్ళు పోసి వేసేవాల్లం. కలలో కూడా ఊహించలేని పనులు నేడు జరుగుతున్నాయి అని అన్నారు. తెలంగాణ రాక ముందు 2014లో 30కోట్ల 28లక్షల రూపాయల వడ్లు పండితే, గతేడాది 344 కోట్ల 16 లక్షల వడ్లు పండాయి. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల కానే కాదు అన్న రంగనాయక సాగర్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుంచి తాగునీరు, సాగునీరు ఇవ్వలేదు.

ఢిల్లీలో ఒకడేమో కాళేశ్వరం దండగా అంటాడని, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పండుగల పెట్టిన పెట్టుబడితో ఎప్పుడో నిండి పోయింది. దండగా అనేది ప్రతి పక్షాలకు దండగా అయిందని విమర్శ. గతంలో కాలం కోసం ఆకాశం వైపు చూస్తే.. ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నాం. మహారాష్ట్ర నుంచి 150 మంది రైతుల బృందం మన ప్రాజెక్ట్ లు చూడడానికి వచ్చారని, దేశంలోని రైతులు నేడు కేసీఆర్ వైపు చూస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ మహారాష్ట్రలో 4 రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప 16 రాష్ట్రాల్లో మహిళలు బీడీలు చేస్తే ఎక్కడ పింఛన్లు ఇవ్వడం లేదు అని ఆయన అన్నారు.

Related posts

మంగమారిపేట బీచ్ లో పెను విషాదం

Satyam NEWS

రెండు రోజుల పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి

Satyam NEWS

విజయనగరం దండుమారమ్మ టెంపుల్ అన్న సమారాధన

Satyam NEWS

Leave a Comment