తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా ఎం. ధర్మనాయక్ ఆర్ శ్రీరాంనాయక్ లు నాయకులు తిరిగి ఎన్నికయ్యారు. 13 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం,57 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. అధ్యక్ష వర్గంగా ఎం ధర్మ నాయక్, డి రవి నాయక్, జీ.భీమా నాయక్,భూక్యా విజయ బాయి లు వ్యవరించగా,సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.అనంతరం జిల్లాల వారీగా సంఘం నాయకులు నివేదిక పై చర్చల్లో పాల్గొన్నారు. ఈ మహాసభలో 27 తీర్మానాలను ఆమోదించారు. అనంతరం 13 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం ఎం. ధర్మ నాయక్ (అధ్యక్షులు)ఆర్. శ్రీరాం నాయక్ (ప్రధాన కార్యదర్శి) గుగులోత్ ధర్మ,(ఉపాధ్యక్షులు.) డి రవి నాయక్,గుగులోత్ భీమాసాహెబ్,(ఉపాధ్యక్షులు), వీ వీరన్న,(ఉపాధ్యక్షులు), కొర్ర శంకర్( ఉపాధ్యక్షులు), భూక్యా వీరభద్రం (సహాయ కార్యదర్శి) ఆంగోత్ వెంకన్న (సహాయ కార్యదర్శి), ఎం బాలు నాయక్ (సహాయ కార్యదర్శి), ఎం.రవి నాయక్ (సహాయ కార్యదర్శి), ఎం.శంకర్ నాయక్ (సహాయ కార్యదర్శి), మొత్తం 57 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
previous post