27.2 C
Hyderabad
May 18, 2024 22: 02 PM
Slider నల్గొండ

యూత్ కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం

#Youth Congress

రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ సత్తా చూపాలని,పార్టీ అధికారంలోకి రావడానికి,అధికార పార్టీ అక్రమాలను ఎత్తిచూపేలా ప్రజలలో చైతన్యం తీసుకువాలని హుజూర్ నగర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో నియోజకవర్గ స్థాయి యూత్ విభాగం ముఖ్య నాయకుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పట్టణ‌‌ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ రావు ముఖ్య అతిధిగా హాజరైన ఈ సమావేశానికి విచ్చేసిన యువకులంతా పూర్తిగా యూత్ కాంగ్రెస్ టీ షర్టులు ధరించడం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని మండలాలలో చురుకైన యువతతో ప్రతి గ్రామానికి కమిటీలు నియమిస్తామని అన్నారు. రానున్న నూతన సంవత్సరం ప్రారంభం వరకు యూత్ కాంగ్రెస్ ను ప్రక్షాళను చేసి పని చేసేవారితో నూతన మండల కమిటీలను నియమిస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యూత్ కాంగ్రెస్ సత్తా చూపిస్తామని తెలిపారు.

జనవరి నెలలలో అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసినందుకు 1,000 మంది న
నిరుద్యోగ యువతతో పెద్దఎత్తున నిరసన ర్యాలీని నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిరోజు ఒక క్రొత్త కార్యక్రమంతో గ్రామాల నుండి,నియోజకవర్గ కేంద్రం వరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ధర్నాలు,నిరసన ర్యాలీ చేయడానికి యూత్ కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ విభాగాల సహకారంతో తమ వంతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషిస్తామని కుక్కడపు మహేష్ గౌడ్ వెల్లడించారు.

సమీక్ష సమావేశానికి హాజరై విజయవంతం చేసినందుకు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ పులి బాలకృష్ణ,ప్రచార కార్యదర్శి కస్తాల రవీందర్,పట్టణ అధ్యక్షుడు రెడపంగు రాము,మండల అధ్యక్షుడు శీలం చిరంజీవి, గరిడేపల్లి మండల యూత్ అధ్యక్షుడు బచ్చలకూరి కృష్ణ,మండల యూత్ ఉపాధ్యక్షుడు బత్తిని రాంబాబు, మఠంపల్లి మండల యూత్ అధ్యక్షుడు తెల్లబాటి శ్రీనివాస్,నేరేడుచర్ల పట్టణ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్,కరక్కాయల గూడెం గ్రామ యూత్ అధ్యక్షుడు మద్ద వినయ్,చింతలపాలెం మండల యూత్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,పాలకీడు మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, నేరేడుచర్ల యూత్ మండల అధ్యక్షుడు ఉప్పుల శ్రీను,మేళ్ళచెర్వు మండల అధ్యక్షుడు సాధమ్ సత్యనారాయణ లకు కుక్కల భూ మహేష్ ప్రత్యేక ధన్యవాదమలు తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ములుగులో చురుకుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Satyam NEWS

అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో అండ‌గా కాల్ సెంట‌ర్‌

Satyam NEWS

వరంగల్ కు ఎక్కువ ఐటీ కంపెనీలు రావాలి

Satyam NEWS

Leave a Comment