పల్నాడు జిల్లా వినుకొండ లో ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది. పిడుగురాళ్ల ప్రాంత వాసి బత్తుల శాంతరాజు కుటుంబ సభ్యులతో కూలి పనుల నిమిత్తం బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. శాంతరాజుకు బండి సైలెన్సర్ తగిలి రెండు వారాలు క్రితం కాలికి గాయమైంది. దురదగా ఉందని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లాడు. రేమిడిచర్లకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సాయి టీటీ ఇంజక్షన్ చేశాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత శాంతరాజు స్పృహ లేకుండా పడిపోయాడు.
దీంతో శాంతరాజును హుటాహుటిన వినకొండ లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ సాయి అక్కడ నుండి జారుకున్నాడు. దీంతో ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది బలవంతంగా మృతదేహాన్ని బయటకు పంపించి వేయడంతో దిక్కుతోచని బంధువులు రోదిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ అన్యాయంగా మా బిడ్డను పోట్టణ పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.