29.2 C
Hyderabad
May 18, 2024 13: 20 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

#KamareddyPolice

కామారెడ్డి పట్టణ సిఐపై వచ్చిన ఐపీఎల్ బెట్టింగ్ ఏసీబీ కేసులో కొత్త మలుపు తిరిగింది. నేడు ఉదయం సిఐ జగదీష్ కు జిల్లా ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించిన అధికారులు అనంతరం సిఐని డిఎస్పీ కార్యాలయానికి తరలించారు.

 బెట్టింగ్ కేసు విషయంలో సుధాకర్ అనే వ్యక్తికి 5 లక్షలు లంచం డిమాండ్ చేసిన విషయంలో ఇప్పటికే సిఐ జగదీష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదే బెట్టింగ్ విషయంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందేమో అనే అనుమానంతో డిఎస్పీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.

ఉదయం నుంచి డిఎస్పీ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఉంటున్న ఇంటికి అధికారులు తాళం వేశారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ లక్ష్మీనారాయణ హుటాహుటిన హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు కామారెడ్డికి చేరుకున్నారు.

దాంతో తన కార్యాలయంలోనే డిఎస్పీని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటలుగా ఏసీబీ అధికారుల విచారణ, సోదాలు కొనసాగుతున్నాయి.

Related posts

జనతా గ్యారేజ్: ట్రంప్ విధ్వంసానికి రిపేర్లు మొదలు

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం

Satyam NEWS

అత్యాచారానికి గురై ఆపై గర్భందాల్చిన మైనర్ బాలిక

Satyam NEWS

Leave a Comment