వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం దేవనూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దేవనూర్ గ్రామ సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ ఎల్లప్ప, ఎంపీటీసీ మొగులమ్మ, డైరెక్టర్ లు ఆశన్న, సప్తగిరి చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.