71 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఆదివారం ఉదయం అస్సాంలో మూడు పేలుళ్లు సంభవించాయి. ఇది గ్రెనేడ్ పేలుళ్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు.30 నిమిషాల్లో తక్కువ తీవ్రత తో కూడిన మూడు పేలుళ్లు అస్సాం లోని దీబ్రుగర్ , చరైడియో మరియు దులియాజన్లో జరిగాయి. పేలుళ్లతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు ప్రాణనష్టం జరగలేదు.
నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఇండిపెండెంట్) (ఉల్ఫా-ఐ) లే ఈ పేలుళ్లకు కారణమని అనుమానిస్తున్నారు .దీబ్రుగర్లో ని గ్రాహం బజార్ వద్ద ఎన్హెచ్ 37 సమీపంలో ఉన్న ఒక దుకాణంలో పేలుడు సంభవించింది. పోలీసులు, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.