బిచ్కుంద మండలంలో అయిదు ఎకరాల పొలం వుండి ఆర్థిక స్తోమత కలిగి రేషన్ తీసుకుంటున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ గ్రామాల్లోని నిరుపేదలకు వలస కూలీలకు రేషన్ కార్డు లేని వారికి రేషన్ బియ్యంను విరాళంగా అందించాలని తహశీల్దార్ వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి ఒక్కరికి పన్నెండు కిలోలు వచ్చాయి కావున అందులో ఆరు కిలోల బియ్యాన్ని నిరుపేద కుటుంబాలకు విరాళంగా అందజేయాలని ఆయన కోరారు. ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ముందుకు రావాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీనియర్ సహాయకులు రాచప్ప రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.