తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకే బుధవారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్, మేళ్ళచెరువు, మఠంపల్లి, చింతలపాలెం మండలాల నూతన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యవర్గ సభ్యులను ప్రకటించారు.
అధ్యక్షుడుగా అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుగులోతు బాలాజీ, ప్రధాన కార్యదర్శి గా ఇరిగెల రామకృష్ణారెడ్డి, కోశాధికారి గా వేముల వెంకన్న, ఉపాధ్యక్షులు గొట్టిముక్కల నిర్మల,కాకునూరి హనివిరెడ్డి, రేపాకుల కోటయ్య,ఉస్తెల సైదిరెడ్డి,షేక్ దస్తగిరి,కిష్టపాటి సీతారాం రెడ్డి, ప్రచార కార్యదర్శిగా సాముల వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శులుగా పెండ్లి అచ్చయ్య, గుండపనేని నరసింహారావు,మల్ రెడ్డి కృష్ణారెడ్డి, బియ్యాల చిన్న కోటయ్య, మల్లెల వెంకటరెడ్డి,యాదగిరి కోటయ్య, నరాలశెట్టి పుల్లమ్మ,సహాయక కార్యదర్శులు గా దొంతగాని జగన్,కొట్టే సైదారావు,బండారు విజయ్, చెడపంగు కోటేశ్వరరావు, ఎన్నికైనారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హూజూర్ నగర్