108లో మహిళ ప్రసవించిన సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.నూతనకల్ మండలం తాళ్ల సింగారానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108కు సమాచారం అందించారు.
వెంటనే 108 చేరుకొని ఆ మహిళను తీసుకొస్తుండగా నెమ్మి కల్ సమీపంలో పాపకు జన్మనిచ్చింది. అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. ప్రసవం చేసిన ఈఎంటి బానోతు రమేష్,పైలట్ బంటు నాగేశ్వరరావులను బంధువులు అభినందించారు.