తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్ వింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని సైబరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ “క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్” పై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లోని పరిధిలోని అన్నీ జోన్ల డిసిపి లు , ఏసిపి లు, ఎస్హెచ్ఓ లు, డిఐ లు, ఎస్ఐ లు, డిఎస్ఐ లు, అన్ని పోలీస్ స్టేషన్లలోని బ్ల్యూ కోల్ట్, పాట్రోల్ మొబైల్ , సిసిఎస్, క్రైమ్స్ సిబ్బంది తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, పిఎస్ఐఓసి ఏసిపి రవీందర్ ఆధ్వర్యంలో ‘క్రైమ్ అనలిటిక్స్ మరియు రిపోర్ట్స్’ పై సమీక్ష జరిగింది.
ఈ సమావేశంలో సైబరాబాద్ జోన్లలో పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది నేరాల సంఖ్యను తగ్గించే విధంగా క్రైమ్ అనాలసిస్ , నేరాల అంచనా, నేరాలను ఎలా నిరోధించాలి తద్వారా గస్తీ ఏ విధంగా నిర్వహించాలి అనే తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నేర నియంత్రణ లో తప్పనిసరి అనుసరించవలసిన చర్యలను తీసుకోవాలని సూచించారు.
నేరాల పట్ల త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి నాణ్యతతో కూడిన దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. క్రైమ్ హాట్ స్పాట్ లను ఎలా నియంత్రించలి, క్రైమ్ ప్రోన్ ఏరియాలను, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను గుర్తించి నివారణ మార్గాలను చేపట్టదానికి వివిద అప్ప్లికేషన్ల ద్వారా నేరాలను నియంత్రించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నేర నియంత్రణ కోసం అనుసరించవలసిన, రూట్ కాస్ అనాలసిస్, రిపోర్ట్ అనాలసిస్ గురించి పోలీస్ స్టేషన్లలో ఉండే సెక్టార్ డిఐ, డిఎస్ఐ, సెక్టార్ ఎస్ఐలకు మరియు క్రైమ్ సిబ్బందికి నేర నివారణ అంశాలను తెలియజేశారు.
ప్రతిరోజు క్రైమ్ ఎనాలసిస్ రిపోర్ట్ తయారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లకు పంపించి, ఈ రిపోర్టు ఆధారంగా నేర నియంత్రణ చర్యలను చేపట్టవలసిన వీలుంటుంద్దన్నారు. నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నేర నియంత్రణ లో తప్పనిసరి అనుసరించవలసిన చర్యలను తీసుకోవాలని సూచించారు.