ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఓక్కరు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎన్ గౌతమ్ రావు అన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవ పక్షం కార్యక్రమంలో భాగంగా డివిజన్ లోని నింబోలి అడ్డ, ఏకే భవన్ ఫంక్షన్ హాల్ లో కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్ గౌతమ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.సురేష్ గౌడ్, డాక్టర్.సమత, నాయకులు బి. సంతోష్, సుభాష్ పటేల్, క్షీర సాగర్, అరవింద్, కృష్ణ కుమార్, భీమ్ రాజ్, ఆర్.సంతోష్, సీతారామ్ కులకర్ణి, మనోజ్, రవి యాదవ్, నాగు, సూరి, దీపక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట