ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షను లోకానికి చాటిన కేసీఆర్ దీక్ష జరిపి నేటికి సరిగ్గా పదేళ్లు నిండాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమం లో ఉవ్వెతున్న ఎగిసిపడుతున్న భావోద్వేగాలు, వాలిపోతున్న తెలంగాణ బిడ్డలు, మనసు కరగని పాలకులు… 60 ఏళ్ల గోస కు ఇకనైనా ముగింపు పలకాల్సిందేనన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో మలిదశ కీలక ఘట్టంగా కేసీఆర్ దీక్ష మారిందని తెలిపారు. తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ చచ్చుడో… అనే మొండితనంతో ఆనాడు చేపట్టిన ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుగమమం అయ్యిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి అన్నారు.
దీక్ష కు 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ లో విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్లు, పండ్లు అందజేశారు. వృద్ధులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమానికి తన వంతు కృషిగా సహాయం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మెన్ నరేందర్ రెడ్డి,TRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.