కరోనా కేసులు దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా పెరుగుతున్నాయో అందరికి తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా అలాగే పెరుగుతున్నాయి. నియోజకవర్గం కి సంబంధించిన కొందరు పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. కొల్లాపూర్ లో శనివారం జిల్లా పరిధిలో నమోదైన కరోనా కేసుల వివరాలను వైద్య శాఖ అధికారులు తెలియజేశారు. ఒక కొల్లాపూర్ మున్సిపాలిటీ లోనే 46 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మాస్క్ కచ్చితంగా వినియోగించాలని కోరుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.