30.2 C
Hyderabad
May 17, 2024 15: 11 PM
Slider రంగారెడ్డి

వెక్స్డ్ మైండ్:పెండ్లిచేయడంలేదని యువతి ఆత్మహత్య

love suicide

ప్రేమించిన యువకుడితో పెండ్లిచేయడంలేదని భాదతో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నయువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్‌ మున్సిపాలిటీ, ఇందిరమ్మకాలనీకి చెందిన వైష్ణవి (18) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది.

వైష్ణవికి బహదూర్‌పల్లికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఓ యువకుడిని ప్రేమించానని, అతన్నే పెండ్లి చేసుకుంటానని వైష్ణవి తల్లిదండ్రులకు తెలిపింది. పరిస్థితుల నేపథ్యంలో పెండ్లికి కొంత సమయం పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Related posts

కొత్త రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలి

Satyam NEWS

పాము కాటు మృతుని కుటుంబానికి ఉత్తమ్ సంతాపం

Satyam NEWS

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

Leave a Comment