26.7 C
Hyderabad
April 27, 2024 08: 15 AM
Slider రంగారెడ్డి

కొత్త రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలి

#Talakondapally Mandal

కొత్త రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎమ్మార్వోకు స్థానిక నేతలు వినతి పత్రం సమర్పించారు. కరోనా సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన 1500 రూపాయలు అందని వారికి తక్షణమే అందివ్వాలని వారు కోరారు.

రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అదే విధంగా చుక్కాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన దేవాదాయ భూములను కాపాడవలసిందిగా  ఎమ్మార్వో కు అందచేసిన వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండలం జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, తలకొండపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్ పాల్గొన్నారు.

ఇంకా, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతయ్య, సర్పంచ్ రమేష్, బండి రఘుపతి , లక్ష్మణ్, ధరణి శివశంకర్రెడ్డి ,లలిత రాజు సింగల్ విండో డైరెక్టర్లు శేఖర్ యాదయ్య గ్రామస్తులు జగదీశ్వర్, రవి, దశరథం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జో బైడెన్ గెలుపును ఖరారు చేసిన అమెరికన్ కాంగ్రెస్

Satyam NEWS

హర్యానాలో 12 పిస్టల్స్ లభ్యం

Sub Editor

భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

Satyam NEWS

Leave a Comment