కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గత కొద్ది రోజులుగా కాలి నొప్పితో బాధపడుతున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇటీవల కాలికి సర్జరీ చేయించుకున్నారు. ఈ మధ్య కామారెడ్డిలో పలు కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గంప గోవర్ధన్ ను పరామర్శించారు. ప్రస్థుత ఆయన ఆరోగ్య పరిస్థితి,అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను తెలుసుకున్నారు. గంప గోవర్ధన్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
previous post
next post