సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కాలనీకి చెందిన అమరబోయిన కామయ్య (వెంకటేశ్వర్లు) అనారోగ్యంతో బాధపడుతూ గత వారం మరణించారు. నిరుపేద కుటుంబం కావడంతో దశ దిన కర్మ చేయడానికి ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ కి తెలియడంతో ట్రస్ట్ తరుపున 15 కేజీల నూనె డబ్బా,15 కేజీల బియ్యం కుటుంబ సభ్యులకు మంగళవారం అందించారు.
కామయ్య కుటుంబానికి తాను బతికున్నప్పుడు జనచైతన్య ట్రస్ట్ తరుపున బియ్యం పంపిణీ చేశారు.నేటి జనచైతన్య ట్రస్ట్ కార్యక్రమానికి సహకరించిన రాజస్థాన్ రంగులు హోల్ సేల్ డీలర్ నాగుబండి ఉపేందర్ ను ట్రస్ట్ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ళ వంశీ,అధ్యక్షుడు పారా సాయి, ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్, ప్రధాన కార్యదర్శి రమేష్,సాయి,కాశీ తదితరులు పాల్గొన్నారు.
సత్యం ప్రతినిధి, హుజూర్ నగర్