సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ కు కాకతీయ ఎక్స్ ప్రెస్ స్థానంలో కొత్త రైలు ప్రారంభం కాబోతున్నది. ఈ నెల 18 నుండి సికింద్రాబాద్ లో ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ సాయంత్రం 6.50 గంటలకు బయలు దేరి భద్రాచలం రోడ్ కు 19న ఉదయం 3.30 గంటలకు చేరుతుంది.
ఈ ట్రైన్ మౌలాలి, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, బోనగిరి, యాదాద్రి, ఆలేరు, జనగామ, రఘునాదపల్లి, ఘనపూర్, పెండ్యాల్, కాజీపేట, వరంగల్, చింతలపల్లి, ఏలగూరు,నెక్కొండ, ఇంటికన్నే, కేసముద్రం, తడ్లపూసలపల్లి, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పోచారం, కరేపల్లి, గాంధీపురం లలో ఆగుతుంది.
చివరకు భద్రాచలం రోడ్ స్టేషన్ చేరుతుంది. పాత కాకతీయ స్థానంలో ఎక్స్ ప్రెస్ ట్రిన్ పునరిద్దించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ రైల్వే అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సత్యం న్యూస్, హైదరాబాద్