మూగజీవి కి ఆహారాన్ని అందించి సహృదయాన్ని చాటుకున్నారు ములుగు,భుపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. సోమవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రక్కన ఆకలితో అలమటిస్తూ చెత్తకుప్పలోని పేపర్లు,ప్లాస్టిక్ కవర్లు తింటున్న పశువును చూసి చలించిపోయిన తస్లీమా పండ్లు, కూరగాయలు అందించి పశువు ఆకలిని తీర్చారు.
మనుషులకు ఆకలి వేస్తే అడుగుతారని, కానీ నోరు లేని మూగ జీవాలు అడుగలేవని మనమే అర్థం చేసుకొని ఆహారాన్ని అందించాలని తస్లీమా తెలిపారు. పశుగ్రాసం దొరకక ఆకలితో అలమటించే మూగ జీవాల ఆకలిని తీర్చి మానవత్వం చాటుకోవాలని తస్లీమా కోరారు.