సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శాంతి స్తూపం వద్ద గులాబి పూలతో వినూత్న నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి మాట్లాడుతూ హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు ను సిసి రోడ్ వేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో గజం లోతు గుంటలలో బస్సులు,ఆటోలను జాగ్రత్తగా నడపాలని, ప్రయాణించే ప్రయాణికులను క్షేమంగా తమ గమ్యానికి చేర్చమంటూ బస్సు డ్రైవర్లకు,ఆటో డ్రైవర్లకు,కార్ డ్రైవర్లకు,ద్విచక్ర వాహనదారులకు గులాబీ పూలు అందిస్తూ నిరసన తెలియజేశారు.
హుజూర్ నగర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,రోడ్డు మీద గుంతల వల్ల నిత్యము వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని రవి తన ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు,రైతుల ట్రాక్టర్లు ఇరుక్కుపోతున్నా పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు.ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్డు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉమామహేశ్వరరావు,గుండా గోపి,కంటు నాగరాజు,గుగులోతు రవి, నకిరేకంటి రాంబాబు,దేవిశెట్టి మురళి, గోపి,కృష్ణ,మట్టయ్య,శ్రీనివాసరావు, అమర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్