24.7 C
Hyderabad
May 18, 2024 23: 10 PM
Slider వరంగల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన చింతలపూడి

#kishan reddy

రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషి చేసినందుకు కేంద్ర పర్యాటక శాఖ క్యాబినెట్ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కి ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

నేడు ఢిల్లీలో మంత్రిని కలిసి  శాలువాతో సత్కరించి రామప్ప కట్టడాల సంబంధించిన మెమొంటో ను బహుకరించారు.

తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడానికి కారణం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అని ఆయన అన్నారు.

ఈనెల 17వ తారీఖున కిషన్ రెడ్డి  రామప్ప ఆలయ సందర్శన కార్యక్రమంపై చర్చించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి తో పాటు, జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబుకు హాండ్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు

Satyam NEWS

రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన కొరముట్ల

Satyam NEWS

అప్పుడు కన్ను గీటి ఇప్పుడు స్మిమ్మింగ్ పూల్ లో మునిగి

Satyam NEWS

Leave a Comment