కడప జిల్లా పుల్లంపేటలో రైతు భరోసా కేంద్రాన్ని రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి ప్రజా ప్రతినిధులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రములో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశాన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో సాధించిన విజయాలను వక్తలు సభలో కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కొరముట్ల శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు.