ఇప్పటికే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఆ పార్టీకి మరో ముప్పు తెచ్చిపెట్టారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందున ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విజయసాయిరెడ్డికి నోటీసు జారీ చేసింది. పిటిషన్ పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
ఈనెల 10న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ జరుపుతుంది.