ఈనెల 21వ,తేదీన జరిగే తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు కార్మిక కర్షక,విద్యార్ధి,నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కదలి రావాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం టి ఎన్ టి యు సి అనుబంధ రైస్ మిల్ డ్రైవర్ల దినసరి కూలీల యూనియన్ సమావేశంలో ఇటీవల మరణించిన సీనియర్ నాయకుడు నర్సింగ్ సత్యనారాయణ కు ఘనంగా నివాళులు అర్పించి,వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ హుజూర్ నగర్ లోని రైస్ మిల్లుల డ్రైవర్లకు 8 గంటల పని సాధించిన పోరాటంలో నర్సింగ్ సత్యనారాయణ కీలక పాత్ర పోషించారని అన్నారు.ఈనెల 21వ, తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,పార్టీ సీనియర్ నాయకులు హాజరై ప్రసంగిస్తారని,పెద్ద ఎత్తున జరిగే ఈ మహా బహిరంగ సభను విజయవంతం చేయాలని శీతల రోషపతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకం కోటేశ్వరరావు, చొప్పర లాలయ్య, సామాల కోటమ్మ,చింతల మంగమ్మ,మున్ని తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్