31.2 C
Hyderabad
May 18, 2024 15: 57 PM
Slider జాతీయం

క్లోస్డ్ లైన్:109 ఏళ్ల అత్యంత పురాతన రైల్వే లైను బంద్

up oldest railway line closed by court order

అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు యూపీలోని ధుధ్వా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే 109 ఏళ్ల అత్యంత పురాతన రైల్వే లైను మూతపడనుంది. నాన్‌పారా- మైలానీ మధ్య నడిచే 171 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గం అడవుల మధ్య నుంచి సాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం గా లఖీంపూర్- మైలానీ బ్రాడ్ గేజ్ మార్గం ఈ నెలాఖరుకు ప్రారంభం కానుంది. తరువాత నాన్‌పారా- మైలానీ రైలు మార్గం మూతపడనుంది.

అటవీ జంతువులు, అటవీ సంరక్షణ దృష్ట్యా సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు నాన్‌పారా- మైలానీ రైలు మార్గాన్ని మూసివేయ నున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తాము ధువాన్ వచ్చే ప్రయాణికుల కోసం ఒక టాయ్‌ట్రైన్ ప్రారంభిస్తామని, దానివలన అటవీ జంతువులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని తెలిపారు. కాగా ధుధ్వా టైగర్ రిజర్వ్‌కు చెందిన అధికారి సంజయ్ పాఠక్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదాల్లో వందలాది జంతువులు మృతి చెందాయని అన్నారు.

Related posts

అరుణాచల గిరి ప్రదర్శనకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు

Satyam NEWS

ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయండి: సి ఐ టి యు

Bhavani

కేసీఆర్ కుమార్తె కవిత అలిగి అమెరికా వెళ్లిందా

Satyam NEWS

Leave a Comment