ఈనెల 29న,ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహా బహిరంగ సభను జయప్రదం చేయటానికి అన్ని రంగాల కార్మికులతో సోమవారం సమావేశమైనారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను,జిల్లా కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పోరాట రూపకల్పనకు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్ర మూడో మహా బహిరంగ సభ దోహదపడుతుందని అన్నారు.
ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, కార్మిక శాఖ మంత్రి కె.శివన్ కుట్టి హాజరవుతారని,ఆ రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాలను ప్రభుత్వ పనితీరును వెల్లడించనున్నారని తెలియజేశారు.29వ, తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు కదలి రావాలని,బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఉపతల వెంకన్న,ఉపాధ్యక్షుడు పల్లపు రామకృష్ణ,రైస్ మిల్ డ్రైవర్లు,దిన కూలీలు పర్వతాలు,జానకి రాములు,రాధా, వెంకటమ్మ, గోపమ్మ, తిరపయ్య, ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.శ్రీను,పూల సంఘం నాయకులు రాజేష్,యశోద ట్రాన్స్పోర్ట్ రంగం కార్మిక సంఘం నాయకులు చింతకాయల గోపి, పంగ సైదులు రెడ్డి,హమాలి కార్మిక సంఘం అధ్యక్షుడు చింతకాయల సీతయ్య, మామిడి వీరబాబు,నరసింహారావు, మహిపాల్,జక్కుల నాగమణి,యల్లావుల సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్