30.2 C
Hyderabad
May 17, 2024 15: 36 PM
Slider నిజామాబాద్

రుణమాఫీ ఇంకెన్నాళ్లు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీజేపీ

#arunatara

రైతులకు రుణమాఫీ ఇంకెన్నాళ్లకు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నించింది. రైతు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు అరుణతార మాట్లాడుతూ.. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా చేయడం లేదన్నారు. ఫలితంగా రైతుబంధు, పంట డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాగానే బ్యాంకు వాళ్ళు రుణం కట్ చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ధరణి సమస్యలతో రైతులు అల్లాడుతున్నారని, సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారన్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Related posts

గుర్రంపై వచ్చి నామినేషన్

Satyam NEWS

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి

Satyam NEWS

వనపర్తిని పట్టణాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలి

Satyam NEWS

Leave a Comment