30.2 C
Hyderabad
May 17, 2024 17: 45 PM
Slider హైదరాబాద్

కృష్ణంరాజు సతీమణికి బాలయ్యబాబు పరామర్శ

#balakrishna

దివంగత రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నేడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కృష్ణంరాజు మరణించిన సమయంలో బాలకృష్ణ తన 107వ చిత్రం షూటింగ్‌ కోసం టర్కీలో ఉన్నారు. ఈ కారణంగా కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. హైదరాబాద్‌కి చేరుకున్న బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి నేడు కృష్ణంరాజు సతీమణిని పరామర్శించారు.

ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ను చూస్తూ పెరిగాననీ, ఇండస్ర్టీకి ఆయనెంతో సేవ చేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. అలాంటి అద్భుతమైన నటుడితో  కలిసి నటించే అవకాశం సుల్తాన్‌, వంశోద్థారకుడు చిత్రాలతో వచ్చిందని చెప్పారు. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Related posts

కర్నూలులో కిలో రెండు రూపాయలకు పడిపోయిన టమాటా

Bhavani

నకిలీ విత్తనాల నిందితుడు మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్

Satyam NEWS

చెంచుల అభివృద్ధికి పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు

Satyam NEWS

Leave a Comment