దివంగత రెబల్స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నేడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. కృష్ణంరాజు మరణించిన సమయంలో బాలకృష్ణ తన 107వ చిత్రం షూటింగ్ కోసం టర్కీలో ఉన్నారు. ఈ కారణంగా కృష్ణంరాజు పార్ధీవదేహాన్ని చూడటానికి రాలేకపోయారు. హైదరాబాద్కి చేరుకున్న బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి నేడు కృష్ణంరాజు సతీమణిని పరామర్శించారు.
ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ను చూస్తూ పెరిగాననీ, ఇండస్ర్టీకి ఆయనెంతో సేవ చేశారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. అలాంటి అద్భుతమైన నటుడితో కలిసి నటించే అవకాశం సుల్తాన్, వంశోద్థారకుడు చిత్రాలతో వచ్చిందని చెప్పారు. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.