42.2 C
Hyderabad
May 3, 2024 17: 31 PM
Slider నల్గొండ

నకిలీ విత్తనాల నిందితుడు మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్

#Duplicate Seeds

నకిలీ విత్తనాల కేసులో కీలక నిందితుడు, కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు నల్గొండ జిల్లా చండూర్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు.

కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న జిల్లా పోలీసులు సమగ్ర విచారణ పూర్తి చేసిన తర్వాత జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చండూర్ సిఐ సురేష్ కుమార్ పి.డి. ఛట్ఠం కింద శనివారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదుసూధన్ రెడ్డిపై పి.డి. యాక్ట్ నమోదు చేయగా నకిలీ పత్తి విత్తనాల కేసులలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని సురేష్ కుమార్ తెలిపారు.

నకిలీ పత్తి విత్తనాల బారిన రైతాంగం పడకుండా పటిష్ట నిఘాతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చండూర్ సిఐ సురేష్ తెలిపారు.

Related posts

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS

భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ తో మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి భేటీ

Satyam NEWS

పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్ష‌న్ నెం-1 షూటింగ్ ప్రారంభం!

Bhavani

Leave a Comment