బీజేపీ నాయకుడు, మైనింగ్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన గాలి జనార్ధన్ రెడ్డి కి నేడు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గాలి జనార్ధన్ రెడ్డి ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి లతో కూడిన ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
కేసులపై వెంటనే ట్రయల్ మొదలు పెట్టాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజు వారీ విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా నెల రోజులు మాత్రమే గాలి జనార్ధన్ రెడ్డి బళ్ళారిలో ఉండేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.