28.2 C
Hyderabad
May 17, 2024 10: 49 AM
Slider గుంటూరు

మట్టిఖర్చుల విషయంలో కూడా విఆర్ఏ లకు జగన్నన్న మోసం

#navataramparty

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో 21000 వేతనం ఇస్తానని, నామినీలను విఆర్ఏ లుగా నియమిస్తామని 2017లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మడమ తిప్పారని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆయన నేడు ప్రసంగించారు. తెలంగాణ లో 30 శాతం విఆర్ఏ లకు పీఆర్సీ అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మొండిచేయి చూపించడం సిగ్గుచేటన్నారు. 21000 వేతనం ఇవ్వాలని ఇతర డిమాండ్ లు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. దీక్షకు సంపూర్ణంగా మద్దతును తెలిపారు. కార్యక్రమంలో  సంఘం నేతలు పాల్గొన్నారు.

Related posts

చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బాసటగా నిలిచిన బ్యాచ్ మేట్స్

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోఅంబెడ్కర్ జయంతి

Satyam NEWS

చీమలపాడు గ్రామస్థుల ఆందోళన

Bhavani

Leave a Comment