శ్రీ శ్రీ శ్రీత్రిదండి చినజియర్ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్ నిర్వహిస్తున్న సమతామూర్తి రామానుజ జియర్ స్వామి విగ్రహ వేడుకలో నేడు పలువురు మునిసిపల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరెణి చేతన హరిష్, రామంతాపుర్ కార్పోరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు తదితరులు నేడు సమతామూర్తి వేడుకలో పాల్గొనగా ఈ సందర్బంగా యాగశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలో పాల్గొన్ని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి,రామంతాపుర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వులుగోంద నారాయణ దాసు బాలకృష్ణగౌడ్, వేముల తిరుపతయ్య, ముశిగంపల శివగౌడ్, పోన్నాడ లక్ష్మి, తాళ్ల మంగ,కవిత, అదేష్, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ సత్యం న్యూస్