ఏ.ఐ.సి.సి పిలుపు మేరకు నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలనుసారం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీము సైనికులను అవమాన పరిచినట్లు, యువతను నిర్వీర్యం చేసినట్లు ఉన్నందున అగ్నిపథ్ స్కీమును వెంటనే రద్దు చేయాలనే డిమాండ్ తో సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎంపి క్యాంపు కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్ డి ఓ కి మెమోరాండం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లికార్జున్ రావు,జక్కుల మల్లయ్య, బాచిమంచి గిరిబాబు,కస్తాల శ్రవణ్ కుమార్, బెల్లంకొండ గురవయ్య, పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్