31.7 C
Hyderabad
May 7, 2024 01: 59 AM
Slider ముఖ్యంశాలు

టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నరేష్ రెడ్డి

#revanthreddy

జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డా. బి .ఎం. వినోద్ కుమార్ సోమవారం ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు. 

నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. ‘సౌదీ అరామ్కో’ కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు.

ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది” అని అన్నారు.

“రాష్ట్ర ప్రభుత్వం.. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం… హైదరాబాద్ లో సౌదీ అరేబియా, యుఏఈ కాన్సులేట్ లు ఏర్పాటు చేసేలా ప్రయత్నించాలి. ఎన్నారైలు తమ ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా  వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి.

రూ. 10 లక్షల విలువైన  ‘ప్రవాసి భారతీయ బీమా యోజన’ అనే ప్రమాద బీమాలో సహజ మరణం కూడా కవర్ అయ్యేలా చూడాలి. గల్ఫ్ దేశాల నుండి ఇండియా కు ఇటీవల పెంచిన విమాన చార్జీలను తగ్గించాలి” అని డా. బి. ఎం. వినోద్ కుమార్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Related posts

జిల్లా న్యాయ సేవాసదన్ లో బాలల సంరక్షణ పై శిక్షణ…!

Satyam NEWS

నిన్న రోజా… నేడు ఆనం :సీరియల్ అవమానాలు

Satyam NEWS

టీటీడీ బోర్డులో నేరచరితుల నియామక పిటీషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

Satyam NEWS

Leave a Comment