28.7 C
Hyderabad
May 6, 2024 07: 40 AM
Slider ప్రత్యేకం

ఆధునిక భారత నిర్మాత పీవీ నర్సింహారావుకు ఘన నివాళి

#Telangana CM KCR

భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి ( జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళులు అర్పించారు.  క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన  ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు అని సిఎం కెసిఆర్ కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి  రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.

దేశ  ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో  ఇమిడివున్నదని సిఎం అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ,  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ  దేశానికి ఆదర్శంగా  నిలిచిందన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పివీ నిరూపించారని సిఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన  స్పూర్తితో ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ తెలిపారు.

Related posts

కొల్లాపూర్ అసత్ పూర్ రాజా వారి భూములను పేద ప్రజలకు పంచాలి

Satyam NEWS

రసకందాయంలో పడ్డ శ్రీకాళహస్తి రాజకీయాలు

Bhavani

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోనా

Satyam NEWS

Leave a Comment