నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట డిపో నుండి సర్వీసులు పెంచడమైనది. పెంచిన సర్వీసులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎండు గుంపాలెం కు గతంలో రెండు ట్రిప్పులకు అదనంగా మరో రెండు ట్రిప్పు లు. ఒంగోలుకు ప్రస్తుతం నాలుగు సర్వీసులు తిరుగుతున్నాయి వీటికి అదనంగా మరొక సర్వీసు ఏర్పాటు. అలాగే ఊడిజర్ల నుండి ఈపూరు ముప్పాళ్ళ రొంపిచర్ల మీదగా గుంటూరుకు సర్వీసు ఏర్పాటు. గుంటూరు ఆర్డినరీ సర్వీసులు 12 నుండి 16కు పెంపు. గోగులపాడుకి మరొక ట్రిప్పు అదనం. చిరుమామిళ్ళకు రెండు ట్రిప్పులు పెంచామని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచామని ప్రజలు పై సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని షేక్ అబ్దుల్ సలామ్ డిపో మేనేజర్ నరసరావుపేట తెలిపారు.
next post